Saturday, May 4, 2024

కోనసీమ జిల్లాలో విషాదం.. తల్లీ, కూతురు సజీవదహనం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కోనసీమ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. జిల్లాలోని అల్లవరం మండలం కొమరగిరిపట్నంలో జరిగిన అగ్నిప్రమాదంలో తల్లి కూతురు సజీవదహనమయ్యారు. ఈరోజు తెల్లవారుజామున 4గంటల సమయంలో పూరి గుడిసె దగ్ధమైంది. తల్లి సాధనాల మంగాదేవి (40), కూతురు మెడిశెట్టి జ్యోతి (23) మృతి చెందారు. 5 నెలల క్రితం లవ్ మ్యారేజ్ చేసుకున్న జ్యోతి ప్రస్తుతం గర్భవతిగా ఉంది. అయితే ఈ అగ్నిప్రమాదం పై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దుండగుడు వీరిద్దరిని హత్య చేసి ఇల్లు తగలపెట్టారని అనుమానిస్తున్నారు. అనుమానితుడి పోలీసులు అరెస్టు చేసి విచారిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement