Wednesday, May 1, 2024

ప్ర‌ధాని న‌రేంద్ర మోడీకి -యోగా శిక్ష‌కుడిగా మంచిర్యాల‌కి చెందిన రాజేశ్

నేడు హైదరాబాద్‌కు చేరుకోనున్నారు ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ..అనంత‌రం ఆయ‌న బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొంటారు. కాగా ఆయ‌న నోవాటెల్‌లో బస చేస్తారు. మోడీ రెండ్రోజుల పర్యటనలో భాగంగా.. ఆయనకు ప్రత్యేక వ్యాయామ శిక్షకుడిని నియమించింది తెలంగాణ క్రీడాప్రాధికార సంస్థ. మంచిర్యాలకు చెందిన గడప రాజేశ్​ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 2 నుంచి 4వరకు ట్రెడ్‌మిల్‌, జిమ్‌ సైకిల్‌ సాధనకు శిక్షకుడిగా వ్యవహరించనున్నారు. ఈ మేరకు తెలంగాణ క్రీడాప్రాధికార సంస్థ నుంచి ఉత్తర్వులు వచ్చాయి. ప్రస్తుతం అతను హైదరాబాద్‌లోని జింఖానా మైదానంలో అథ్లెటిక్స్‌ కోచ్‌(సాట్స్‌)గా విధులు నిర్వర్తిస్తున్నారు. మూడ్రోజులపాటు దేశ ప్రధాని వ్యాయామ సాధనలో భాగస్వామిని కావడం ఆనందంగా ఉందని రాజేశ్ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement