Tuesday, April 30, 2024

‘మా’ భవనాన్ని ఎందుకు అమ్మేశారు?: మోహన్ బాబు సంచలన వ్యాఖ్య

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) సర్వసభ్య సమావేశంలో సీనియర్ నటుడు మోహన్ బాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘మా’ క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడు కృష్ణంరాజు అధ్యక్షతన ఆదివారం మధ్యాహ్నం అసోసియేషన్‌ సర్వసభ్య సమావేశం జరిగింది. కరోనా పరిస్థితుల రీత్యా వర్చువల్‌గా నిర్వహించిన ఈ సమావేశంలో నటుడు మోహన్‌బాబు ప్రశ్నల వర్షం కురిపించారు.  ‘మా’ కోసం గతంలో ఓ భవనం కొని అమ్మేశారని మోహన్‌బాబు అన్నారు.

” రూపాయికి కొన్న స్థలాన్ని అర్ధరూపాయికి అమ్మేశారు. ఇది ఎంతవరకు సబబు? దాని గురించి ఎవరైనా మాట్లాడారా? ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ఉన్నారు. ‘మా’కు సొంత భవనం కోసం కేటాయించిన సొమ్ముతో స్థలం కొని దాన్ని సగం ధరకే అమ్మేయడంపై సినీ పెద్దలు ఆలోచించాలి” అని మోహన్ బాబు అన్నారు. అసోసియేషన్‌ భవనం విషయం తనను ఎంతో కలచివేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, ‘మా’కు సొంత భవనమే ప్రధాన అజెండాగా ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మోహన్ బాబు వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement