Thursday, May 2, 2024

మోదీ పర్యటన.. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫాం నెం.10 మూసివేత

సికింద్రాబాద్ నుండి తిరుపతికి వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలును జెండా ఊపి లాంచ్ చేయడానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రేపు (శనివారం) సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ను సందర్శించారు. ఈ కారణంగా, ప్లాట్‌ఫారమ్ నంబర్ 10లో ప్రయాణికుల రాకపోకలతో పాటు వేయిటింగ్ రూమ్స్, టిక్కెట్ బుకింగ్, క్యాటరింగ్ స్టాల్స్, వంటి సౌకర్యాలు మూసివేయనున్నారు అధికారులు.

ఇవ్వాల (శుక్రవారం) మధ్యాహ్నం 12 గంటల నుంచి రేపు (శనివారం) మధ్యాహ్నం 1 గంట వరకు పరిమితులు అమల్లో ఉంటాయని రైల్వే అధికారులు తెలిపారు. రైల్వే అధికారులు పౌరులు మార్పు గురించి తెలుసుకోవాలని మరియు వారి ప్రయాణాన్ని తగిన విధంగా ఏర్పాటు చేయాలని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement