Saturday, April 27, 2024

@70M: ట్విట్టర్ లో మోదీ ఫాలోయింగ్ అదుర్స్..

ప్రధాని నరేంద్ర మోదీకి మనదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది. మోడీ సైతం సోషల్ మీడియాలో కూడా ఎప్పుడు యాక్టివ్ గా ఉంటారు. ఎప్పుడు ఎదో ఒక పోస్ట్ తో అభిమానులకు దగ్గరగా ఉంటారు మోదీ.. ప్రతి విషయాన్ని ప్రజలతో పంచుకోవడంతో పాటు సందేశాలతో పాటు సూచనలతో పాటు ప్రభుత్వ పథకాలపై ట్విట్టర్ వేదికగా వివరిస్తూ వస్తున్నారు. దీంతో మోదీని ట్విట్టర్ లో అనుసరిస్తున్న వారి సంఖ్య 70 మిలియన్ మార్క్ దాటేసింది. ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియాలో అత్యధిక ఫాలోవర్స్ ఉన్నవారిలో క్రియాశీల రాజకీయ నేతల్లో ఒకరిగా ప్రధాని మోదీ నిలిచారు. రాజకీయ ప్రసంగాలతో మోదీ ఎప్పటికప్పుడు తన ఫాలోవర్స్‌ను పెంచుకున్నారు. 2009లో మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ట్విట్టర్ ఖాతాను ప్రారంభించారు. 2010లో లక్ష మంది ఫాలోవర్స్ చేరగా.. 2011 నవంబర్‌లో ఫాలోవర్స్ సంఖ్య 4 లక్షలకు పెరగ్గా.. ఆ తర్వాత ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం భారీగా పెరిగారు. మోదీ దేశ ప్రజలను ఉద్దేశించి తన ప్రసంగాలతో ఆకట్టుకున్నారు.

ఇది కూడా చదవండి : దానం నాగేందర్‌కు ఊరట..జైలు శిక్ష నిలిపివేసిన హైకోర్టు

Advertisement

తాజా వార్తలు

Advertisement