Monday, April 29, 2024

దమ్ముంటే రాజీనామా చేసి గెలవండి.. ఆ ఎమ్మెల్యేలకు సీతక్క సవాల్

కాంగ్రెస్ గుర్తుతో గెలిచి పార్టీ ఫిరాయించి టీఆర్ఎస్‌లో చేరిన ఎమ్మెల్యేలను రాళ్లతో కొట్టాలంటూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి కార్యకర్తలకు ఇచ్చిన పిలుపునివ్వడం హాట్ టాపిక్ అయ్యింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలంతా ప్రెస్ మీట్ పెట్టి మరీ రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ పార్టీని తీవ్ర స్థాయిలో దుమ్మెత్తిపోశారు. రేవంత్‌పై తీవ్ర విమర్శలు చేశారు. దీనిపై స్పందించిన కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క… రాజీనామా చేసి గెలవాలంటూ సవాల్ విసిరారు.

పార్టీ మారిన ఎమ్మెల్యేలు నీచంగా మాట్లాడుతున్నారని సీతక్క మండిపడ్డారు. కోట్లకు అమ్ముడుపోయిన ఎమ్మెల్యేలు ఓటుకు నోటు అని మాట్లాడటం సిగ్గుచేటు అని విమర్శించారు. కాంగ్రెస్ కార్యకర్తల కష్టంతో గెలిచి ఇప్పుడు వారిపైనే కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే వారిని తరిమి కొట్టాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారని తెలిపారు. దమ్ముంటే ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి టీఆర్‌ఎస్‌ నుంచి గెలవాలని సవాల్ విసిరారు. తప్పుడు కూతలు మానుకోకుంటే ప్రజలే రాళ్లతో కొడతారని హెచ్చరించారు. కార్యకర్తల అభీష్టం మేరకే రేవంత్‌కు పీసీసీ పదవి ఇచ్చారని సీతక్క చెప్పారు.

ఇది కూడా చదవండి: రేవంత్ కేక‌తో.. కేసీఆర్‌లో కాక!

Advertisement

తాజా వార్తలు

Advertisement