Sunday, April 28, 2024

ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి మాతృమూర్తి మృతి.. కేసీఆర్‌ సంతాపం

ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి మాతృమూర్తి పద్మమ్మ ఈరోజు కన్నుమూశారు. వృద్ధాప్యంతో పాటు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె తమ స్వగ్రామం ఇబ్రహీంపట్నం మండలం ఎలివినేడులో ఈరోజు తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. కిషన్‌ రెడ్డి మాతృమూర్తి మృతిపట్ల ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంతాపం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తంచేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement