Monday, April 29, 2024

మౌలిక సదుపాయాల కల్పనే ధ్యేయం – పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి

ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నామని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పేర్కొన్నారు. పట్టణంలోని 32 వ వార్డు లో మీ కోసం వార్డు సందర్శనలో భాగంగా కాలనీలను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. పెద్దపల్లి పట్టణంలో కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు చేపడుతున్నామన్నారు. ప్రజలకు అవసరమైన రోడ్లు, డ్రైనేజీలు, కల్వర్టర్లు నిర్మిస్తున్నామన్నారు. పెద్దపెల్లి పట్టణ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నామని రాబోయే రోజుల్లో మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సహకారంతో మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టేందుకు కృషి చేస్తున్నామన్నారు. జిల్లా కేంద్రానికి తగ్గట్టుగా సదుపాయాలు కల్పించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ నజ్మీన్ సుల్తానా-మోబిన్, కౌన్సిలర్ పోతని పురుషోత్తం, పద్మ రవి, వంశీ, తెరాస ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement