Friday, April 26, 2024

మారుమూల పల్లెల్లో జ‌రిగిన క‌థ ”మిషన్‌ ఇంపాజిబుల్‌”

మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ అనేక ప్రాజెక్టులను చేపట్టింది. స్టార్స్‌తో భారీ బడ్జెట్‌ చిత్రాలు తీస్తూ, ఇంకోవైపు మీడియం బడ్జెట్‌ సినిమాలను కూడా నిర్మిస్తోంది. వాటిలో మిషన్‌ ఇంపాజిబుల్‌ చిత్రం ఉంది. ఇందులో తాప్సీపన్ను కథానాయిక. స్వరూప్‌ దర్శకుడు. ఈ చిత్రం సంగీత ప్రమోషన్లు ఇటీవలే ప్రారంభమయ్యాయి, ఇటీవలే చిత్ర బృందం ”ఏద్దాం గాలం.. ” అనే లిరికల్‌ వీడియోను విడుదల చేసింది, దీనికి సంగీత ప్రియుల నుండి మంచి స్పందనే వచ్చింది. తాజాగా సినిమా విడుదల తేదీని కూడా ప్రకటించారు. వేసవిలో అపరిమిత వినోదాన్ని అందించడానికి ”మిషన్‌ ఇంపా జిబుల్‌” ఏప్రిల్‌ 1న థియేటర్లలోకి రానుంది.

తిరుపతికి సమీపంలోని ఓ మారుమూల పల్లెటూరి నేపథ్యంలో సాగే కథాంశంతో ప్రేక్షకులను ఆకట్టుకునే చిత్రంగా రూపొందింది. నిరంజన్‌ రెడ్డి, అన్వేష్‌ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, ఎన్‌ ఎం పాషా సహనిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement