అర్దరాత్రి పోలీస్ క్యాంప్ పై మావోయిస్టులు దాడికి పాల్పడిన ఘటన చత్తీస్ ఘడ్ లో చోటుచేసుకుంది. కిస్టారం పోలీస్ స్టేషన్ పరిధిలోని పోత్కపల్లి క్యాంపుపై మావోలు ఒక్కసారిగా దాడికి పాల్పడడంతో జవాన్లు అప్రమత్తమయ్యారు. ఆత్మరక్షణ కోసం జవాన్లు ఎదురు కాల్పులు జరిపారు. జవాన్ల కాల్పుల్లో పలువురు మావోయిస్టులు మృతిచెందగా, మరికొంత మందికి గాయాలైనట్లు తెలుస్తోంది. పోలీస్ క్యాంపుపై దాడికి పాల్పడింది పిఎల్ జిఏ 1వ బెటాలియన్ మావోయిస్టు పార్టీ సభ్యులుగా అనుమానం వ్యక్తమవుతోంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital