Friday, April 26, 2024

కృష్ణా జిల్లాలో విషాదం.. అదృశ్యమైన ముగ్గురు చిన్నారులు మృతి

కృష్ణా జిల్లా ఆగిరిపల్లి మండలం ఈదరలో సోమవారం అదృశ్యమైన ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. శోభనాపురం చెరువులో శశిక (11), చంద్రిక (9), జగదీశ్ (8) మృతదేహాలను మంగళవారం మధ్యాహ్నం స్థానికులు గుర్తించారు. డెడ్ బాడీలను బయటకు తీసి నూజివీడు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ముగ్గురు చిన్నారులు సోమవారం మధ్యాహ్నం బయటకు వెళ్లారు. నిన్న రోజంతా గాలించినా ఆచూకీ కనిపించకపోవడంతో కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement