Friday, April 26, 2024

దేశమ్మ తల్లికి టిటిడి పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి రోజా సెల్వ‌మ‌ణి

తిరుపతి సిటీ : దేశమ్మ తల్లికి టిటిడి పట్టు వస్త్రాలను రాష్ట్ర పర్యటక సాంస్కృతిక వ్యవహారాల యువజన సర్వీసుల క్రీడా మంత్రి ఊరిలో ఆర్కే రోజా సెల్వమణి దంపతులు మంగళవారం నగిరి పట్టణంలోని నగరి ప్రజల గ్రామదేవత శ్రీ దేశమ్మ తల్లి అమ్మవారికి ఆడి నెల పూజా ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించడం జరిగింది.

తిరుమల తిరుపతి దేవస్థానం వారి తరపున మొట్టమొదటిసారిగా పట్టు వస్త్రాలను మంత్రి ఆర్కే రోజా సెల్వ‌మణి దంపతులు ఆలయ సమీపంలోని శ్రీ వినాయక స్వామి వారి ఆలయం నుంచి కాలినడకన తీసుకుని వెళ్లి దేశమ్మ‌ వారికి స్వయంగా సమర్పించారు. ఆలయ నిర్వాహకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి.. ఆలయ అర్చకులు వేదమంత్రాలతో దంపతులను ఆశీర్వదించారు. మంత్రి దంపతులకు దేశ‌మ్మ‌ అమ్మవారికి పొంగిళ్లతో నైవేద్యం సమర్పించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement