Tuesday, March 26, 2024

పింగళి వెంకయ్య జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న‌ మంత్రి ఆర్.కె.రోజా

తిరుపతి సిటీ : ఆజాదీకా అమృత మహోత్సవ పింగళి వెంకయ్య జయంతి ఉత్సవాల్లో భాగంగా రాష్ట్ర పర్యటక సాంస్కృతిక వ్యవహారాల యువజన సర్వీసుల క్రీడా శాఖ మంత్రి ఆర్కే రోజా మంగళవారం నగిరి పిసిఎన్ హైస్కూల్లో జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య జన్మదిన సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి ఆర్కే రోజా మాట్లాడుతూ… వెంకయ్య 146వ జయంతిని దేశమంతా నిర్మించుకోవడం చాలా గర్వకారంగా ఉందన్నారు. తెలుగు గడ్డమీద పుట్టిన జెండా రూపకర్త పింగళి వెంకయ్య జయంతి మన రాష్ట్రంలో ఘనంగా నిర్వహించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు.

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పింగళి వెంకయ్య కుటుంబాన్ని గతంలో స్వయంగా కలిశారని గుర్తు చేశారు. మను స్వేచ్ఛ వాయువులు పీల్చుకుంటున్నామంటే అందుకు కారణమైన స్వాతంత్ర సమరయోధుల ప్రాణ త్యాగాలను గుర్తు చేసుకుంటూ భావితరాలకు రేపటి తరాలకు తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రధానమంత్రి ఇచ్చిన పిలుపుకు స్పందించి మన రాష్ట్రంలో ఆ మహానుభావులను స్మరించుకునేలా గొప్పగా ఈ మహోత్సవాలు నిర్వహించుకోవడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు, వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement