Thursday, May 2, 2024

నేడు ఆదిలాబాద్‌, నిర్మల్‌ జిల్లాల్లో మంత్రి కేటీఆర్ పర్యటన

తెలంగాణ రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ ఈరోజు ఆదిలాబాద్‌, నిర్మల్‌ జిల్లాల్లో పర్యటించనున్నారు. బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి మొదట ఆదిలాబాద్‌ జిల్లా జైనథ్‌ మండలంలోని దీపాయిగూడకు చేరుకుంటారు. అక్కడ ఆదిలాబాద్‌ ఎమ్మెల్యే జోగు రామన్న కుటుంబ సభ్యులను మంత్రి కేటీఆర్‌ పరామర్శిస్తారు. అనంతరం రోడ్డు మార్గం ద్వారా 11.30 గంటలకు ఆదిలాబాద్‌ పట్టణానికి చేరుకుంటారు. బీడీఎన్‌టీ ల్యాబ్స్‌, ఎన్‌టీటీ డాటా బిజినెస్‌ సొల్యూషన్స్‌ ఐటీ టవర్స్‌ ఉద్యోగులతో సమావేశమవుతారు. మధ్యాహ్నం 12.30 గంటలకు ఆదిలాబాద్‌ నుంచి బయల్దేరి ఒంటి గంటకు నిర్మల్‌ జిల్లా బాసర చేరుకుంటారు. ట్రిపుల్‌ ఐటీ విద్యార్థులతో భేటీ అనంతరం వారితో కలిసి భోజనం చేస్తారు. అనంతరం 3 గంటలకు హైదరాబాద్‌ బయలుదేరుతారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement