Tuesday, April 30, 2024

ఈఎస్ఐ సూపరింటెండెంట్ పై మంత్రి హరీశ్ రావు ఆగ్రహం

సంగారెడ్డి జిల్లా ఈఎస్ఐ ఆస్పత్రి సూపరింటెండెంట్ పై రాష్ట్ర వైద్యాఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈఎస్ఐ ఆస్పత్రికి సంబంధించిన వివరాలు ఇవ్వాలని మంత్రి కోరారు. అయితే ఆస్పత్రి వివరాలు ఇవ్వకపోవడంతో సూపరింటెండెంట్ పై మంత్రి హరీశ్ రావు ఆగ్రహించారు. నాలుగేళ్లుగా డ్యూటీకి రాని నలుగురు వైద్యులపై మంత్రి ఫైర్ అయ్యారు. నలుగురు వైద్యులపై చర్యలెందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. ఆస్పత్రిలో ప్రసవాలు ఎందుకు చేయట్లేదని మంత్రి ప్రశ్నించారు. జులై నెలలో కేవలం మూడు డెలివరీలపై మంత్రి హరీశ్ రావు సీరియస్ అయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement