Wednesday, May 8, 2024

సివిల్స్‌ ర్యాంకర్లకు మంత్రి హరీశ్‌రావు విందు

సివిల్స్ టాప్ ర్యాంక‌ర్ల‌కు ఆర్థిక, వైద్య ఆరోగ్య‌శాఖ మంత్రి హ‌రీష్ రావు బుధ‌వారం త‌న నివాసంలో అల్పాహార విందు ఇచ్చారు. సీఎస్‌బీ ఐఏఎస్‌ అకాడమీ డైరెక్టర్‌, మెంటార్ మల్లవరపు బాలలత నేతృత్వంలో సివిల్స్‌ ర్యాంకర్లు హరీశ్‌రావును కలిశారు. అనంత‌రం మంత్రి హ‌రీష్ రావు వారిని ఘ‌నంగా స‌త్క‌రించారు. సివిల్స్ లో ర్యాంకులు సాధించ‌డం గ‌ర్వ‌కార‌ణ‌మ‌న్నారు. స్వయంగా ఐఏఎస్ అయిన బాలలత.. హైదరాబాద్‌లో ఐఏఎస్ శిక్షణ సంస్థ సీఎస్‌బీ అకాడమీని ఏర్పాటుచేసి ఇప్పటివరకు వందమందికిపైగా సివిల్స్ విజేతలను తీర్చిదిద్దడం గర్వకారణమన్నారు. మంత్రిని కలిసిన వారిలో సుధీర్‌కుమార్‌రెడ్డి (ర్యాంక్‌-69), అరుగుల స్నేహ (136), బీ చైతన్య రెడ్డి (161), రంజిత్‌కుమార్‌ (574), స్మరణ్‌రాజ్‌ (676)తో పాటు ఎన్ఆర్ఐ మల్లవరపు సరిత ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement