తెలంగాణ రాష్ట్ర ముస్లిం సోదర సోదరీమణులకు రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మిలాద్ ఉన్ నబీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. మహమ్మద్ ప్రవక్త పుట్టిన రోజైన మిలాద్-ఉన్-నబీ సందర్భంగా ఈ పండుగను జరుపుకోవడం జరుగుతుందన్నారు. మహమ్మద్ ప్రవక్త బోధనలైన దాతృత్వం, కరుణ, ధార్మిక చింతన, సర్వ మానవ సమానత్వం, ఐకమత్యం మానవాళికి సదా అనుసరణీయం అన్నారు. తెలంగాణ గంగా జమునా తేహజీబ్ అన్నారు. రాష్ట్రంలో పాలు నీళ్లలా ప్రజలంతా మత, కుల, ప్రాంత, వర్గ బేధాలు లేకుండా పండుగలు జరుపుకుంటారు అన్నారు. తెలంగాణలో ప్రభుత్వమే పండుగలను నిర్వహిస్తున్నదని, సీఎం కెసిఆర్ పరిపాలనలో ప్రజలంతా కలిసి మెలసి జీవిస్తున్నారన్నారు. అందరి శ్రేయోభిలాషిలా సీఎం ఆలోచిస్తున్నారు, రాష్ట్ర, ప్రజల సర్వతోముఖాభివృద్ధికి ప్రభుత్వం పనిచేస్తున్నదన్నారు. భక్తి, శ్రద్ధలతో ఈ పండుగ జరుపుకోవాలని కోరుకుంటున్నాను అన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement