Monday, April 29, 2024

బుల్లెట్ బండిని న‌డిపిన.. మంత్రి ఎర్ర‌బెల్లి

బుల్లెట్ బండిని న‌డిపారు మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు. ఆయన స్వయంగా బుల్లెట్ బండిని నడపడం ఆసక్తిని రేకెత్తించింది. వెనుక ఒకరిని కూర్చొబెట్టుకుని ఎర్రబెల్లి దయాకర్ రావు బుల్లెట్ బండి నడిపారు. మంత్రి స్వయంగా బుల్లెట్ బండి డ్రైవ్ చేసుకుంటూ రోడ్డుపై వెళ్లడం ఆసక్తికరంగా మారింది. కొంతమంది దీనిని చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ప్రస్తుతం నెట్టింట ఈ వీడియో చక్కర్లు కొడుతోంది.జనగాం జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలోని దేవురుప్పుల మండల కేంద్రంలో మంగళవారం నియోజకవర్గ స్థాయి ప్లీనరీ సమావేశం జరగనుంది. ఈ కార్యక్రమం ఏర్పాట్లను పరిశీలించేందుకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అక్కడకు వెళ్లారు.

ఈ సందర్భంగా సభ స్థలి, సభ ఏర్పాట్లను పరిశీలించి స్థానిక నేతలకు పలు సూచనలు చేశారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఈ సందర్భంగా స్థానిక బీఆర్ఎస్ నేత కొత్త బుల్లెట్ బైక్ కొనగా.. దానిని నడపాలని మంత్రిని గులాబీ శ్రేణులు కోరారు.కార్యకర్తల కోరిక మేరకు కొత్త బండి నడిపి మంత్రి దయాకర్ రావు ఆశీర్వదించారు. ప్లీనరీ సమావేశం ప్రాంతంలో బుల్లెట్ బండిపై తిరిగిన ఆయన.. సభాస్థలి నుండి మన్ పహాడ్ వరకు బుల్లెట్ బండి నడుపుకుంటూ వెళ్లారు. బీఆర్ఎస్ కార్యకర్తలు, ఎర్రబెల్లి అభిమానులు, అనుచరులు ఈ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తోన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement