Thursday, May 2, 2024

సీఎం జగన్ తో మంత్రి ధర్మాన భేటీ.. రాజీనామా చేస్తానన్న ధర్మాన

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో మంత్రి ధర్మాన భేటీ అయ్యారు. అయితే ఏపీలో మూడు రాజధానులపై అధికార వైసీపీలో కీలక సంకేతాలు వెలువడినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే సీనియర్ మంత్రి ధర్మాన రాజీనామా ప్రతిపాదన అంశం తెరపైకి వచ్చింది. దీనిలో భాగంగా సీఎం జగన్ తో మంత్రి ధర్మాన ప్రసాద్ భేటీ అయ్యారు. పరిపాలన రాజధానిగా విశాఖ సాధన ఉద్యమం కోసం ధర్మాన రాజీనామా చేస్తానని తెలిపారు. ఈ నేపథ్యంగా తన రాజీనామాను అనుమతించాలని జగన్ ను కోరారు. అయితే ధర్మానను సీఎం జగన్ వారించారు. మూడు ప్రాంతాలకు సమ న్యాయం చేయడమే ప్రభుత్వ ధ్యేయమని తేల్చి చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement