Friday, May 3, 2024

యూనివర్సిటీలో కరోనా.. ఆళ్ల నాని ఆరా

విశాఖలోని ఆంధ్ర యూనివర్సిటీలో కరోనా కలకలంపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని ఆరా తీశారు. దీనిపై వైద్య ఆరోగ్య శాఖ అధికారులను మంత్రి అప్రమత్తం చేశారు. యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చదువుతున్న 65 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. జిల్లా డీఎమ్‌హెచ్‌వో డాక్టర్ సూర్యనారాయణతో మంత్రి ఆళ్ల నాని ఫోన్‌లో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఏయూ ఇంజనీరింగ్ క్యాంపస్‌లో 1500 మందికి కరోనా పరీక్షలు చేయగా 65 మందికి కరోనా నిర్ధారణ అయ్యింది.

మహిళల హాస్టల్ లో 500మందికి శనివారం కరోనా పరీక్షలు చేస్తే 200మందికి నెగెటివ్ వచ్చింది. మిగిలిన 300మంది ఇంజనీరింగ్ మహిళ విద్యార్థునుల కరోనా రిపోర్ట్ రావాల్సి ఉంది.

ప్రతి రోజు 7,500 వరకు కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నామని మంత్రి ఆళ్ల నాని తెలిపారు. విశాఖపట్నం జిల్లాలో ఆరు కోవిడ్ హాస్పిటల్స్ ఏర్పాటు చేశామని చెప్పారు. కేజీహెచ్ హాస్పిటల్, అనకాపల్లి, విమ్స్ నర్సీపట్నం, పాడేరు, అరకు హాస్పిటల్స్ కరోనా బాధితుల కోసం 1000 బెడ్స్ సిద్ధం చేశామని తెలిపారు. కరోనా సోకిన బాధితులు ప్రస్తుతం కేజీహెచ్ హాస్పిటల్‌లో 15 మందికి మెరుగైన వైద్యం అందిస్తున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో వైద్య ఆరోగ్య శాఖ అధికారులను అప్రమత్తం చేశామని మంత్రి ఆళ్లనాని వెల్లడించారు.

మార్కెట్లు, వారంతపు సంతలు, ప్రజా రవాణాలో కరోనా వైరస్ వ్యాప్తికి అవకాశం ఉన్న ప్రదేశాల్లో కరోనా నిబంధనలు తప్పనిసరిగా అమలు చేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ కార్యాలయలు, ప్రవేశ ప్రాంతంలో తప్పనిసరిగా ధర్మల్ స్కానింగ్, శానిటైజర్ వినియోగించాలి ఆదేశించారు. 65సంవత్సరాలు దాటిన వారు, ధీర్గకాలిక వ్యాధులు ఉన్న వారు, గర్భవతులు, 10 సంవత్సరాలలోపు పిల్లలు జాగ్రత్తలు తీసుకోవాలి మంత్రి సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement