Saturday, April 27, 2024

ఏపీ విద్యాశాఖ మంత్రిని ఆడుకుంటున్న ఆకతాయిలు

ఇటీవల కాలంలో సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ప్రతి చిన్న విషయం కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది ఇంకా కొంతమంది ఆకతాయిలు అయితే రకరకాల పోస్ట్ లు క్రియేట్ చేసి సోషల్ మీడియా లో వైరల్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా దేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో పలు రకాల పరీక్షలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాయిదా వేస్తూ వస్తున్నాయి. అయితే ఏపీ లో మాత్రం 1 నుంచి 9 వ తరగతి విద్యార్థులకు సెలవులను ప్రకటించి పది, ఇంటర్ విద్యార్థులకు మాత్రం పరీక్షలను యధాతధంగా నిర్వహిస్తామని ఏపీ విద్యా శాఖ మంత్రి ఆదిములపు సురేష్ ప్రకటించారు.

ఈ నేపథ్యంలోనే కొంత మంది ఆకతాయిలు మంత్రి సురేష్ ఫోటో ను ఎడిటింగ్ చేసి శ్రద్ధాంజలి అంటూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ వైరల్ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement