Thursday, May 2, 2024

కోట్లాది రూపాయల ఆస్తులు వదులుకుని భారత్ వచ్చిన ఆఫ్ఘనిస్తాన్ వాసి

అమెరికా బలగాలు ఉపసంహరించుకోవడంతో ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్లు రాజ్యమేలుతున్నారు. వారి పాలనలో తమ పరిస్థితిని తలచుకుని అక్క‌డి ప్ర‌జ‌లు తీవ్ర ఆందోళ‌న చెందుతున్నారు. ఈ నేప‌థ్యంలో ఆ దేశ ప్ర‌జ‌లు విదేశాల‌కు వెళ్తున్నారు. క‌ష్ట‌ప‌డి సంపాదించుకున్న ఆస్తుల‌న్నీ వ‌దిలి క‌ట్టుబ‌ట్ట‌ల‌తో వారు దేశాన్ని విడిచి వెళ్తున్న తీరు క‌ల‌చివేస్తోంది. ఆఫ్ఘనిస్థాన్ నుంచి ఇమ్రాన్ (28) అనే యువకుడు భారత్‌కు వచ్చాడు. ఇమ్రాన్‌ ఆఫ్ఘ‌నిస్థాన్‌లో కోటీశ్వ‌రుడు. అత‌డికి ఆ దేశంలో కోట్లాది రూపాయల విలువ చేసే భూములు, వ్యాపారాలు ఉండేవి.

కానీ ప్రస్తుతం కోట్లాది రూపాయల ఆస్తులను వదులుకుని ఆయన ఢిల్లీకి వచ్చేశాడు. ఆయనకు కాబుల్‌లో మూడు కోట్ల టర్న్‌ఓవర్ కలిగిన ఆటో స్పేర్‌పార్ట్స్ వ్యాపారం కూడా ఉంది. కోట్ల రూపాయ‌ల ఆస్తుల క‌న్నా ప్రాణ‌మే ముఖ్య‌మ‌ని ఆఫ్ఘ‌న్‌ను వ‌ద‌లివ‌చ్చాడు. ఇప్పుడు ఆయ‌న ఢిల్లీలో నిరుపేద‌గా జీవనం కొన‌సాగిస్తున్నాడు. కాబుల్‌లోనే చిక్కుకుపోయిన‌ తన కుటుంబాన్ని కూడా ఢిల్లీకి తీసుకురావాలని ఇమ్రాన్ ప్రయత్నిస్తున్నాడు. ఇమ్రాన్ మాత్ర‌మే కాదు.. చాలా మంది త‌మ ఆస్తులు వ‌దుకుని విదేశాల‌కు వెళ్తూ చిన్నపాటి ఉద్యోగం దొరికితే చేసుకోవ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నారు.

ఈ వార్త కూడా చదవండి: యూపీ ఎంపీ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు.. తాలిబన్లది స్వాతంత్య్ర పోరాటం

Advertisement

తాజా వార్తలు

Advertisement