Thursday, May 2, 2024

రేప‌టినుంచే మెన్స్ హాకీ ప్ర‌పంచ క‌ప్.. బంగ్లాదేశ్‌తో భారత్ ఢీ

ఒమన్‌లోని సలాలాలో రేపు (మంగళవారం) జ‌ర‌గ‌నున్న‌ ఆసియా హాకీ 5 ప్రపంచ కప్ మెన్స్ క్వాలిఫైయర్‌లో భారత పురుషుల జట్టు బంగ్లాదేశ్‌తో తన ప్రారంభ పోటీని ప్రారంభించనుంది. ఈ ప్రపంచ కప్‌లో టోర్నీలో మెత్తం 12 జ‌ట్లు పోటీ ప‌డుతుండ‌గా.. రెండు గ్రూప్ లు(ఎలైట్ పూల్‌, ఛాలెంజర్స్ పూల్‌)గా విభజించారు.

కాగా, ఎలైట్ పూల్‌లో భార‌త్ లో పాటు.. మలేషియా, పాకిస్తాన్, జపాన్, ఒమన్ & బంగ్లాదేశ్‌లతో జ‌ట్లు ఉన్నాయి. అయితే, ఛాలెంజర్స్ పూల్‌లో హాంకాంగ్, చైనా, ఇండోనేషియా, ఆఫ్ఘనిస్తాన్, కజకిస్తాన్ & ఇరాన్ జ‌ట్లు ఉన్నాయి.

ఇక‌, బంగ్లాదేశ్‌తో రేపు జర‌గ‌నున్న‌ ప్రారంభ పోటీ తర్వాత, ఆగస్టు 30న ఒమన్, పాకిస్థాన్‌లతో భారత్ పోటీపడుతుంది. ఆపై ఆగస్టు 31న మలేషియా, జపాన్‌లతో తలపడనుంది. కాగా, వ‌చ్చే ఏదాది (2024) హాకీ 5s ప్రపంచ కప్‌లో మొత్తం 16 దేశాలు పోటీ పడనుండ‌గా.. ఆ గ్లోబల్ ఈవెంట్‌లో స్థానం పొందాలంటే.. ప్ర‌స్తుతం జ‌రుగున్న టోర్నీలో భారత్ మొదటి మూడు స్థానాల్లో చేరాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement