Thursday, April 25, 2024

‘ఎవ‌రు మీలో కోటీశ్వ‌రుడు’ ప్రోమో విడుద‌ల‌

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న  ‘ఎవ‌రు మీలో కోటీశ్వ‌రుడు’ షో కోసం అభిమానులు, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గ‌తంలో ఎన్టీఆర్‌ బిగ్ బాస్ సీజ‌న్ 1లోనూ హోస్ట్ గా వ్య‌వ‌హ‌రించాడు. ఇప్పుడు ‘ఎవ‌రు మీలో కోటీశ్వ‌రులు’ ప్రోగ్రాంతో మ‌రోసారి అల‌రించ‌డానికి సిద్ధ‌మ‌య్యాడు. ఈ నెలలోనే జెమినీ టీవీ ఈ షో ప్రసారం కానుంది. తాజాగా ఈ షోకు సంబంధించిన తొలి ప్రోమో కూడా ఇప్ప‌టికే విడుద‌లైంది. ఈ రోజు ఈ షో నుంచి మ‌రో ప్రోమో విడుద‌ల చేశారు. ‘ఇక్క‌డ మనీతో పాటు మ‌న‌సులు కూడా గెలుచుకోవ‌చ్చు’ అంటూ ఈ కొత్త ప్రోమోలో ఎన్టీఆర్  డైలాగ్ లో అదరగొట్టాడు. ఇక్కడ కల మీది కథ మీది. ఆట నాది, కోటి మీది అంటూ ఎన్టీఆర్ ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రిస్తున్నాడు. కాగా, కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఈ షో ఆలస్యమైంది.

https://youtu.be/RGMDSXnLIK8
Advertisement

తాజా వార్తలు

Advertisement