Thursday, April 25, 2024

మెడికల్ విద్యార్థిని ప్రీతి ఘటనపై సమగ్ర విచారణ చేయాలి : ఈటెల రాజేందర్

ప్రీతీ ఘటనపై బిజెపి నేత, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ స్పందించారు. ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ప్రీతి ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని ఈటెల రాజేందర్ ప్ర‌భుత్వాన్ని డిమాండ్ చేశారు. నిమ్స్ లో ప్రీతి ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్న ఆయన.. వేధింపుల గురించి పోలీసులకు చెప్పినా ప్రయోజనం లేకపోయిందన్నారు. ఈ ఘటనలో పోలీసుల వైఫల్యం కొంత ఉందన్నారు. ఈ ఘటనకి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రీతికి మెరుగైన వైద్యం అందించాలని, అలాగే చాలా కాలేజీలలో ఇంకా ర్యాగింగ్ కొనసాగుతుందని ఆరోపించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement