Sunday, May 19, 2024

Breaking : స‌ముద్రంలో మునిగిన శ‌ర‌ణార్థుల‌ ప‌డ‌వ‌.. 34మంది మృతి

వంద మంది శ‌ర‌ణార్థుల‌తో వ‌స్తున్న ప‌డ‌వ మునిగిపోయింది.ఈ ప్ర‌మాదంలో 34మంది మృతి చెందారు. కాగా ఈ ప‌డ‌వ‌లో ఓ పసికందు కూడా ఉండడం స్థానిక అధికారులను కలచివేసింది. ఈ పడవలో 100 మందికి పైగా శరణార్థులు ఉన్నట్టు ఇటలీ కోస్ట్ గార్డ్ అధికారులు భావిస్తున్నారు. వారంతా ఇరాన్, ఆఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్ కు చెందినవారిగా గుర్తించారు. కోట్రోన్ ప్రావిన్స్ లోని కలాబ్రియా గ్రామం వద్ద తీరానికి మృతదేహాలు కొట్టుకొని వచ్చాయి. అలల ఉద్ధృతికి సముద్రంలోని బండరాళ్లను బోటు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. బోటు మధ్యకు విరిగిపోవడంతో శరణార్థులు నీటిలో మునిగిపోయారు.ఇటలీ తీరంలో ఈ విషాద ఘటన జరిగింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement