Friday, May 17, 2024

Breaking : పేలిన‌ ఐఈడీ.. న‌లుగురు మృతి.. ప‌దిమందికి గాయాలు

మోటార్ సైకిల్ కి అమ‌ర్చిన ఐఈడీ పేల‌డంతో విస్ఫోట‌నం సంభ‌వించింది. ఈ పేలుడులో న‌లుగురు మ‌ర‌ణించారు. ప‌ది మందికి గాయాలు అయ్యాయి. ఈ సంఘ‌ట‌న పాకిస్తాన్ లోని బ‌లూచిస్తాన్ ప్రావిన్స్‌లో ర‌ఖ్ని మార్కెట్ ప్రాంతంలో చోటు చేసుకుంది.
గాయ‌ప‌డిన వారిని స‌మీప ఆస్ప‌త్రికి త‌రలించి చికిత్స అందిస్తున్నామ‌ని బ‌ర్ఖాన్ స్టేష‌న్ అధికారి (ఎస్‌హెచ్ఓ) స‌జ్జ‌ద్ అఫ్జ‌ల్ పేర్కొన్నారు. ఘ‌ట‌నా స్ధ‌లానికి చేరుకున్న పోలీసుల బృందం ఆ ప్రాంతాన్ని త‌మ ఆధీనంలోకి తీసుకుంది. పేలుడు ప్రాంతం నుంచి ర‌క్త‌పు మ‌డుగులో ఉన్న బాధితుల‌ను వ‌లంటీర్లు ఆస్ప‌త్రుల‌కు త‌ర‌లిస్తున్న వీడియోలు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి.పేలుడు ఘ‌ట‌న‌ను బ‌లూచిస్తాన్ సీఎం మిర్ అబ్ధుల్ ఖుదూస్ బిజెంజో తీవ్రంగా ఖండించారు. ఈ ఘ‌ట‌న‌కు పాల్ప‌డిన‌ దోషుల‌ను అరెస్ట్ చేసి క‌ఠినంగా శిక్షించాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. అమాయ‌క ప్ర‌జ‌ల ర‌క్తాన్ని కండ్ల‌చూసిన వారు మాన‌వ‌త్వానికి శ‌త్రువుల‌ని మండిప‌డ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement