Sunday, April 28, 2024

Indigo Filght: ప్రయాణికులకు రన్‌వేపై భోజనాలు…ఇండిగోకి రూ.1.2 కోట్ల జరిమానా

ప్రయాణికులకు రన్‌వేపై భోజనాలు ఏర్పాటు చేసినందుకు బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (బీసీఏఎస్) సీరియస్ అయ్యింది. గోవా నుంచి ఢిల్లీ వెళ్లాల్సిన ఇండిగో ఫ్లైట్‌ని ప్రతికూల వాతావరణం కారణంగా ముంబైకి మళ్లించడం జరిగింది. అక్కడ ప్రయాణికులు కొన్ని గంటలపాటు నిరీక్షించాల్సి వచ్చింది. ఈ సందర్భంగా ప్రయాణికులకు భోజనాన్ని ఏర్పాటు చేశారు.

ఈ నిర్వాకానికి పాల్పడిన దేశీయ విమానయాన దిగ్గజం ఇండిగోకు రూ.1.2 కోట్ల జరిమానా విధించింది. అయితే విమానం పక్కనే రన్‌వేపై కూర్చొని ప్రయాణికులు భోజనం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటనను విమానయాన నియంత్రణ సంస్థ డీజీసీఏ కూడా తీవ్రంగా పరిగణించింది. ఇప్పటికే ముంబై ఎయిర్‌పోర్టుకి రూ.30 లక్షలు జరిమానా విధించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement