Monday, April 29, 2024

ఐఈడీని పేల్చిన మావోయిస్టులు.. 12 మందికి తీవ్రగాయాలు

ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ జిల్లాలో మరోసారి మావోయిస్టులు పేట్రేగిపోయారు. గురువారం నాడు ఓ వాహనాన్ని ఐఈడీ సహాయంతో మావోయిస్టులు పేల్చి వేశారు. దీంతో ఈ ఘటనలో వాహనంలో ప్రయాణిస్తున్న 12 మంది గాయపడ్డారు. ఇందులో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

రాయ్‌పూర్‌కు 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న మాలెవాధి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఘోటియా గ్రామం సమీపంలో ఉదయం 7:30 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. నారాయణపూర్‌ నుంచి దంతెవాడను కలుపుతూ నిర్మిస్తున్న రోడ్డు మార్గంలో ఈ పేలుడు సంభవించిందని జిల్లా ఎస్పీ అభిషేక్‌ పల్లవ తెలిపారు.

ఈ వార్త కూడా చదవండి: ఇల్లందులో కానిస్టేబుల్ ఆత్మహత్య

Advertisement

తాజా వార్తలు

Advertisement