Saturday, April 20, 2024

ఇల్లందులో కానిస్టేబుల్ ఆత్మహత్య

భద్రాద్రి కొత్తగూడెం: ఇల్లందులో టీఎస్‌పీఎస్‌సీ కానిస్టేబుల్‌ రాంబాబు గురువారం ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ కలహాలతోనే అతడు ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. రాంబాబు ప్రస్తుతం కొత్తగూడెంలో విధులు నిర్వర్తిస్తున్నాడు. ఇటీవల అతనిపై అతని భార్య వేధింపుల కేసు పెట్టింది.

కాగా కానిస్టేబుల్ రాంబాబు ఏడాది నుంచి విధులకు వెళ్లకుండా వేధిస్తున్నాడని భార్య పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు మేరకు కానిస్టేబుల్‌పై కేసు నమోదైంది. ఈ క్రమంలో మనస్తాపంతోనే రాంబాబు ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే రాంబాబు ఆత్మహత్యకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.

ఈ వార్త కూడా చదవండి: ఏపీలో ఆరు రకాలుగా నూతన విద్యావిధానం

Advertisement

తాజా వార్తలు

Advertisement