Friday, May 3, 2024

క్యాడ్బ‌రీ చాక్లెట్ల గోడౌన్‌లో భారీ చోరీ

ఎక్కడైనా డబ్బులు, నగలు దొంగలు దోచుకెళ్లడం చూసుంటాం.. కానీ ఉత్త‌రప్ర‌దేశ్ రాష్ట్రంలో క్యాడ్బ‌రీ చాక్లెట్ల దొంగతనం జరిగింది. క్యాడ్బ‌రీ చాక్లెట్ల గోడౌన్‌లో భారీ చోరీ జ‌రిగింది. ఆ గోడౌన్‌లో ఉన్న సుమారు 17 ల‌క్ష‌ల ఖ‌రీదైన చాక్లెట్ల‌ను దొంగలు ఎత్తుకెళ్లారు. దీనిపై చిన్‌హ‌ట్ పోలీసు స్టేష‌న్‌లో కేసు న‌మోదు చేసిన‌ట్లు క్యాడ్బ‌రీ డిస్ట్రిబ్యూట‌ర్ రాజేంద్ర సింగ్ సిద్దూ తెలిపారు. ఎవ‌రికైనా ఏదైనా స‌మాచారం ఉంటే త‌మ‌కు తెలియ‌జేయాల‌ని ఆయ‌న కోరారు. ఆయన ఫిర్యాదు మేరకు పోలీసులు చాక్లెట్ల దొంగలను పట్టుకునే పనిలో నిమగ్నమయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement