Tuesday, April 30, 2024

National : గడ్చిరోడిలో ఎన్‌కౌంటర్‌.. నలుగురు మావోలు హ‌తం…

తెలంగాణ సరిహద్దు ప్రాంతమైన మ‌హారాష్ట్ర‌లో కాల్పుల మోత మోగింది. గడ్చిరోలిలో తెల్లవారుజామున భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు.

- Advertisement -

మృతి చెందిన వారిలో మావోయిస్టు అగ్రనేత, డీవీసీ సభ్యుడు వర్గీష్‌ ప్లాటూన్‌ సభ్యులు మంగాతు, కురుసం రాజు, వెంకటేష్‌ ఉన్నారు. గడ్చిరోలిలోని అటవీ ప్రాంతంలో కూంబింగ్‌ చేస్తున్న పోలీసులకు మావోయిస్టులు ఎదురుపడ్డప్పుడు కాల్పులు ‍ జరిగాయి. కాల్పుల్లో చనిపోయిన మావోయిస్టులపై రూ. 36 లక్షల రివార్డు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మిగిలిన మావోయిస్టుల కోసం పోలీసుల కూంబింగ్‌ కొనసాగుతోంది. ఈ ఆపరేషన్‌లో భాగంగా పోలీసులు భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement