Monday, May 6, 2024

టీ20 మ్యాచ్‌పై భారీ ఎత్తున బెట్టింగ్‌లు.. వెయ్యి నుంచి లక్షల‌దాకా పందెం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: భారత్‌- ఆస్ట్రేలియా మధ్య ఉప్పల్‌ స్టేడియంలో జరిగిన టీ20 మ్యాచ్‌పై హైదరాబాద్‌లో భారీ బెట్టింగులు జరిగాయి. బాల్‌కు, రన్‌కు, వికెట్‌కు బుకిలు బెట్టింగ్‌ కట్టారు. టాస్‌ గెలవడం నుంచి ప్రతి బంతి, ప్రతి ఓవర్‌కు బెట్టింగ్‌ కట్టినట్లు సమాచారం. బుకీలు, మినీ బుకీలుగా రెండు రకాల బెట్టింగ్‌లకు దిగినట్లు ఆరోపణలు వినవస్తున్నాయి. రూ. వెయ్యి నుంచి లక్షల వరకు బెట్టింగ్‌ కాసినట్లు తెలుస్తోంది. సిరీస్‌ ఎవరు గెలుస్తారనే దానిపై కూడా భారీ బెట్టింగ్‌లకు దిగారు. ఆన్‌లైన్‌ యాప్‌లో లక్షల మంది బెట్టింగ్‌ ఆడినట్లు ప్రచారం జరిగింది.

మ్యాచ్‌ కొనసాగుతున్నంత సేపు ఆన్‌లైన్‌ యాప్‌లో లక్షల మంది బెట్టింగ్‌ కాశారు. ఒక్క ఓవర్‌లో ఎన్ని ఫోర్లు, సిక్స్‌లు కొడతారంటూ కూడా బెట్టింగ్‌ పందాలు కాశారు. భారత్‌ గెలుస్తుందని భారీ బెట్టింగ్‌లు వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఆస్ట్రేలియాపై బెట్టింగ్‌ వస్తే వెయ్యికి 4వేలు బెట్టింగ్‌ కాశారు. బెట్టింగ్‌ రాయుళ్లపై ఎస్‌టీవో, టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు నిఘా పెట్టినా యథేచ్ఛగా పందాలు కాశారు. మూడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఉప్పల్‌ స్టేడియంలో అంతర్జాతీయ క్రికెట్‌ మ్చాచ్‌ జరగడంతో పందెంరాయుళ్లు పెద్ద ఎత్తున బెట్టింగ్‌ లకు తెగబడ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement