Saturday, May 18, 2024

సీక్రెట్ గా వివాహం చేసుకున్న – న‌టి మ‌ధు శాలిని

హీరోయిన్ గానే కాకుండా సెకండ్ హీరోయిన్ గా కూడా ప‌లు తెలుగు..త‌మిళ చిత్రాల్లో న‌టించింది మ‌ధు శాలిని. కాగా ఈ బ్యూటీ సీక్రెట్ గా మ్యారేజ్ చేసుకుంది.తమిళ నటుడు గోకుల్‌ ఆనంద్‌ని వివాహం చేసుకుంది. వీరిద్దరు వివాహం హైదరాబాద్‌లో జరగడం విశేషం. కేవలం బంధుమిత్రలు, అతికొద్ది మంది సెలబ్రిటీల సమక్షంలో ఆమె వివాహం జరిగినట్టు తెలుస్తుంది. తాము వివాహం చేసుకున్నట్టు వెల్లడించిన మధుశాలిని, తమ వివాహం పట్ల అభిమానులు కనిపించిన ప్రేమకి, సపోర్ట్ కి ధన్యవాదాలు తెలిపింది. మీ అందరి ప్రేమతో తమ జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించినట్టు తెలిపింది. ఈ సపోర్ట్,ప్రేమ ఇలానే ఉండాలని తెలిపింది మధు శాలిని. ప్రస్తుతం మధుశాలిని, గోకుల్‌ల పెళ్ళి ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి.
ఇందులో అతికొద్ది మంది సెలబ్రిటీలు పాల్గొన్నట్టు తెలుస్తుంది. అదే సమయంలో చాలా సీక్రెట్‌గానే ఈ వివాహం చేసుకున్నట్టు తెలుస్తుంది. ఆమె ఫోటోలు బయటకు రాకపోవడంతోనే ఆ విషయం అర్థమవుతుంది. బంధుమిత్రులు తీసిన ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో పంచుకోగా అవి నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. మధు శాలిని వివాహాన్ని కన్ఫమ్‌ చేస్తున్నాయి. దీంతో ఆమెకి అభినందనలు తెలియజేస్తున్నారు అభిమానులు.

Advertisement

తాజా వార్తలు

Advertisement