Monday, April 29, 2024

Follow up | స్వల్ప లాభాల్లో ముగిసిన మార్కెట్లు..

దేశీయ స్టాక్‌ మార్కెట్లు గురువారం నాడు స్వల్ప లాభాల్లో ప్లాట్‌గా ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాల నడుమ సూచీలు ఉదయం లాభాలతో ప్రారంభమయ్యాయి. కొద్ది సేపటికే ఇంట్రాడే గరిష్టాలను నమోదు చేశాయి. చివరిలో అమ్మకాల ఒత్తిడితో సూచీలు దిగివచ్చాయి. చివరకు స్వల్ప లాభాలతో ప్లాట్‌గా ముగిశాయి. సెన్సెక్స్‌ 44.42 పాయింట్ల లాభంతో 61319.51 వద్ద ముగిసింది. నిఫ్టీ 20 పాయింట్ల లాభంతో 18035.85 వద్ద ముగిసింది. బంగారం 10 గ్రాముల ధర 85 రూపాయలు తగ్గి 56041 వద్ద ట్రేడయ్యింది. వెండి కిలో ధర 321 రూపాయలు తగ్గి 65100 వద్ద ట్రేడయ్యింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 82.78 రూపాయిలుగా ఉంది.

లాభపడిన షేర్లు..

టెక్‌ మహీంద్రా, నెస్లే ఇండియా, టాటా స్టీల్‌, ఎన్‌టీపీసీ, టీసీఎస్‌, ఏషియన్‌ పెయింట్స్‌, విప్రో, బజాజ్‌ ఫిన్‌సర్‌ ్వ, ఇన్ఫోసిస్‌, ఆల్ట్రాటెక్‌ సిమెంట్స్‌, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, ఎల్‌ అండ్‌ టీ, సన్‌ ఫార్మా, ఐటీసీ, కోల్‌ ఇండియా, అదానీ ఎంటర్‌ప్రైజెస్‌, అపోలో ఆస్పటల్స్‌, దివిస్‌ ల్యాబ్‌, అదానీ పోర్ట్‌ ్స, సిప్లా, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, బజాజ్‌ ఆటో, పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌ షేర్లు లాభపడ్డాయి.

- Advertisement -

నష్టపోయిన షేర్లు..

హిందూస్థాన్‌ యూనిలీవర్‌, ఎం అండ్‌ ఎం బజాజ్‌ ఫైనాన్స్‌, టాటా మోటార్స్‌, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, మారుతీ సుజుకీ, ఎస్‌బీఐ, యాక్సిస్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, టైటాన్‌ కంపెనీ, హెచ్‌డీఎఫ్‌సీ, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, భారతీ ఎయిర్‌టెల్‌, హీరో మోటోకార్ప్‌, ఐచర్‌ మోటార్స్‌, డాక్టర్‌ రెడ్డీ ల్యాబ్స్‌, బీపీసీఎల్‌ షేర్లు నష్టపోయాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement