Thursday, May 2, 2024

బాత్రూంలో జారిపడిన మంద కృష్ణ… అపోలో ఆసుపత్రికి తరలింపు!

ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగకు తీవ్ర గాయాలయ్యాయి. కేంద్రమంత్రులను కలవడానికి ఢిల్లీ వచ్చిన ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ ఆసుపత్రి పాలయ్యారు. ఢిల్లీలోని వెస్ట్రన్ కోర్ట్ రెసిడెన్షియల్ కాంప్లెక్సులోని బాత్రూంలో ఆయన జారిపడడంతో గాయాలయ్యాయి. దాంతో ఆయనను అపోలో ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన ఎప్పుడు జరిగింది? ప్రస్తుతం మంద కృష్ణ పరిస్థితి ఎలా ఉంది? అనే అంశాలపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

ఇది కూడా చదవండి: నీరజ్ చోప్రాకు ప్రశంసల వెల్లువ.. గోల్డెన్ బాయ్ కి రూ.6 కోట్ల నజరానా

Advertisement

తాజా వార్తలు

Advertisement