Sunday, May 5, 2024

ఎన్నికల సిత్రాలు.. కళ్లకు గంతలు కట్టుకుని ప్రచారం

తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం తారాస్థాయికి చేరింది. ఓటర్లను ఆకట్టుకునేందుకు నేతలు వినూత్న రీతిలో ప్రచారం చేపట్టారు. ఈ నేపథ్యంలో ఓ వ్యక్తి తమ నాయకుడిని గెలిపించాలంటూ కళ్లకు గంతలు కట్టుకుని ద్విచక్రవాహనం నడుపుతూ ప్రచారం నిర్వహించాడు. వివరాల్లోకి వెళ్తే… తొండముత్తూరు నియోజకవర్గం నుంచి పోటీలో చేస్తున్న అన్నాడీఎంకే అభ్యర్థి ఎస్పీ వేలుమణిని గెలిపించాలని యు.రాజా అనే వ్యక్తి కళ్లకు గంతలు కట్టుకుని బైకు నడుపుతూ ప్రచారంలో పాల్గొన్నాడు.

ఇలా ఎందుకు చేస్తున్నావని సదరు వ్యక్తిని మీడియా ప్రశ్నించింది. దానికి అతడు ‘పదేళ్ల క్రితం కళ్లు తెరుచుకుని కూడా రోడ్లపై నడిచేందుకు తిప్పలు పడే వాళ్లం. కానీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి కారణంగా కళ్లకు గంతలు కట్టుకుని కూడా రోడ్లపై వాహనాలు నడపవచ్చు’ అని సమాధానం ఇచ్చాడు. కాగా యు.రాజా ప్రచారం వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement