Friday, May 3, 2024

మ‌ల్లెల తీర్థానికి బ‌స్సు స‌ర్వీసు-ప్రారంభించిన తెలంగాణ ఆర్టీసీ

శ్రీశైలంలోని మ‌ల్లెల తీర్థానికి రోజువారీ ప్ర‌త్యేక బ‌స్సు స‌ర్వీస్ ను ప్రారంభించింది తెలంగాణ ఆర్టీసీ. ప్రతి రోజూ ఈ బస్సు సర్వీసు మల్లెల తీర్థం జలపాతానికి పర్యాటకులను తీసుకెళ్లనుంది. దట్టమైన అటవీ ప్రాంతంలో ఉండే ఈ జలపాతాన్ని చూసేందుకు పెద్ద సంఖ్యలో పర్యాటకులు విచ్చేస్తుంటారు. దీంతో వారి సౌకర్యం దృష్ట్యా ఆర్టీసీ ప్రత్యేక సర్వీసు ఏర్పాటు చేసింది.నాగర్ కర్నూల్ జిల్లా అంచ్చంపేట నుంచి ఈ సర్వీసు ప్రతి రోజు ఉదయం 7.30 గంటలకు బయల్దేరుతుంది. అక్కడి నుంచి మళ్లీ 8.30 గంటలకు తిరుగు ప్రయాణమవుతుంది. ప్రతి రోజూ సాయంత్రం 4 గంటలకు మరో సర్వీసు ఉంటుంది. ఇది కూడా సాయంతరం 5.30 గంటలకు అక్కడి నుంచి బయల్దేరుతుంది. హైదరాబాద్ నుంచి మల్లెల తీర్థం 173 కిలోమీటర్ల దూరంలో ఉంది. అచ్చంపేట నుంచే 55 కిలోమీటర్లు ఉండడం గమనార్హం.

Advertisement

తాజా వార్తలు

Advertisement