Monday, May 6, 2024

మ‌మ‌తాబెన‌ర్జీ స‌మావేశానికి-ఆహ్వానించినా వెళ్ల‌ను-కార‌ణం కాంగ్రెస్-అస‌దుద్దీన్ ఒవైసీ

ప‌శ్చిమ‌బెంగాల్ సీఎం మ‌మ‌తాబెన‌ర్జీ విప‌క్ష నేత‌ల‌తో స‌మావేశాన్ని నిర్వ‌హించ‌నున్నారు. కాగా ఈ స‌మావేశానికి త‌న‌ని ఆహ్వానించ‌లేద‌ని..ఒక‌వేళ ఆహ్వానించినా తాను వెళ్ల‌న‌ని తెలిపారు ఎంఐఎం అధినేత అస‌దుద్దీన్ ఒవైసీ.కాగా కాంగ్రెస్ పార్టీ కూడా దీనికి ఒక కారణమని అన్నారు. కాంగ్రెస్ ను ఆహ్వానించారు కాబట్టి… ఆ సమావేశానికి తాము వెళ్లమని చెప్పారు. మమత పార్టీ టీఎంసీ.. తమ పార్టీ గురించి చాలా దారుణంగా మాట్లాడిందని… అలాంటప్పుడు వారి సమావేశానికి ఎలా హాజరవుతామని ఒవైసీ అన్నారు. మొత్తం 19 రాజకీయ పార్టీల నేతలను సమావేశానికి మమత ఆహ్వానించారు. వీరిలో విపక్షాలకు చెందిన ముఖ్యమంత్రులు కేసీఆర్, అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్, నవీన్ పట్నాయక్, పినరయి విజయన్, హేమంత్ సోరెన్, స్టాలిన్, ఉద్ధవ్ థాకరే ఉన్నారు. ఈ సమావేశానికిఏపీ సీఎం జగన్ ని ఆహ్వానించకపోవడం గమనార్హం. మరోవైపు, ఈ సమావేశానికి కేసీఆర్, కేజ్రీవాల్ దూరంగా ఉన్నారు. రాష్ట్రపతి అభ్యర్థిని ప్రకటించిన తర్వాతే తదుపరి నిర్ణయం తీసుకోవాలని కేజ్రీవాల్ భావిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement