Tuesday, May 14, 2024

లక్షకు పైగా కార్లను రీకాల్ ప్ర‌క‌టించి మ‌హీంద్రా..

దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మహీంద్రా & మహీంద్రా కస్టమర్లకు బిగ్ న్యూస్ ని తెలిపింది. తమ‌ కంపెనీ బెస్ట్ సెల్లింగ్ SUV కార్ల‌ను 1 లక్ష యూనిట్లకు పైగా రీకాల్ చేసినట్టు ప్ర‌క‌టించింది. ఇంజన్ బేలోని వైరింగ్ రూటింగ్‌ను పరిశీలించేందుకు స్పోర్ట్స్ యుటిలిటీ వెహికిల్ XUV700 1 లక్ష యూనిట్లకు పైగా రీకాల్ చేస్తున్నట్లు మహీంద్రా అండ్ మహీంద్రా తెలిపింది.

మొత్తం 1,08,306 కార్లను రీకాల్

రీకాల్ కి పిలిచిన XUV700 1,08,306 యూనిట్ల కార్ల ఇంజన్ బేలోని వైరింగ్ లూమ్ రూటింగ్‌ను తనిఖీ చేస్తామని, వైరింగ్ లూమ్ ఫ్రిక్ష‌న్ కార‌ణంగా కట్ అయ్యే ప్రమాదం ఉందని మహీంద్రా తెలిపింది. రీకాల్ చేయబడిన XUV700లు జూన్ 2021 -జూన్ 2023 మధ్య తయారు చేయబడ్డాయి. ఈ టైమ్ లైన్ మ‌ధ్య కాలంలో కొనుగోలు చేసిన‌ XUV700 కార్ల‌ను త్వరలో కంపెనీ సంప్రదిస్తుంది. కంపెనీ వ్యక్తిగతంగా సంప్రదించే వినియోగదారులందరికీ చెక‌ప్ & రిపేర్స్ ఉచితంగా జరుగుతాయని వాహన తయారీదారు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement