Sunday, May 19, 2024

మ‌హేశ్‌బాబు త‌ల్లి ఇందిరాదేవి ఇక లేరు.. అనారోగ్యంతో క‌న్నుమూత‌

టాలీవుడ్ నటుడు మహేశ్ బాబు తల్లి ఇందిరాదేవి కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్‌లోని నివాసంలో ఇవ్వాల (బుధ‌వారం) తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. విషయం తెలిసిన సినీ, రాజకీయ రంగాల ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

కృష్ణ-ఇందిరాదేవికి రమేశ్‌బాబు, మహేశ్‌బాబుతోపాటు కుమార్తెలు పద్మావతి, మంజుల, ప్రియదర్శిని ఉన్నారు. మహేశ్ బాబు సోదరుడు రమేశ్ బాబు అనారోగ్యంతో ఈ మ‌ధ్య‌నే చ‌నిపోయాడు. ఇప్పుడు ఇందిరాదేవి మృతితో ఆ కుటుంబంలో విషాదం అలముకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement