Thursday, May 2, 2024

Maharashtra – గిర్డర్ లాంచర్ మెషీన్ కుప్పకూలి 17మంది దుర్మరణం ..

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం..తెల్లవారుజామున గిర్డర్ లాంచర్ మెషీన్ కుప్పకూలి 17మంది మరణించారు. థానే నగరంలోని సమృద్ధి ఎక్స్ ప్రెస్ హైవే ఫేజ్ 3 నిర్మాణంలో ఉపయోగించిన గిర్డర్ లాంచర్ మెషీన్ కూలిపోయింది. ఈ ఘటనలో 17మంది చనిపోగా, మరో ముగ్గురు గాయపడ్డారు. మరికొంత మంది శిథిలాల కింద చిక్కుకున్నట్లు భావిస్తున్నారు.

థానేలోని సర్లాంబే గ్రామ సమీపంలో వంతెన నిర్మాణం జరుగుతుండగా ప్రమాదం జరిగింది. గిర్డర్ యంత్రాన్ని అనుసంధానించే క్రేన్, స్లాబ్ 100 అడుగుల ఎత్తు నుంచి కిందపడింది.. గాయపడిన వారితో పాటు మృతదేహాలను స్థానిక ఆసుపత్రికి తరలించారు. పోలీసులు, NDRF‌ సిబ్బంది, ఫైర్‌ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని సహాయ సిబ్బంది ఆందోళన వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement