Friday, May 17, 2024

Breaking | ట్రాన్స్​ట్రాయ్​ డైరెక్టర్​ ఇంటిపై ఈడీ దాడులు.. బ్యాంకు రుణాలు ఎగ్గొట్టినట్టు ఆరోపణలు!

హైదరాబాద్ నగరంలో మరోసారి ఈడీ సోదాలు కలకలం రేపుతున్నాయి. జూబ్లీహిల్స్, మణికొండ పంజాగుట్టలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ట్రాన్స్​ట్రాయ్​ డైరెక్టర్​ ఇంటిపై ఈడీ దాడులు జరుగుతున్నాయి. ట్రాన్స్​ట్రాయ్​ డైరెక్టర్​గా ఉన్న మాలినేని సాంబశివరావు బ్యాంకుల నుంచి పెద్ద మొత్తంలో రుణాలు తీసుకుని ఎగ్గొట్టారనే ఆరోపణలున్నాయి. దీంతో ఇవ్వాల (మంగళవారం) ఉదయం నుంచి ఆయన ఇళ్లు, ఆపీసులపై ఏకకాలంలో ఈడీ సోదాలు జరుపుతోంది.

దాదాపు 15 ప్రాంతాల్లో ఈ సోదాలు జరుగుతున్నట్టు సమాచారం. హైదరాబాద్​లోని జూబ్లీహిల్స్​, మణికొండ, పంజాగుట్టలో ఏకకాలంలో సోదాలు చేపట్టారు. ట్రాన్స్​టాయ్​ పవర్​, టెక్నో యూనిట్​ ఇన్​ఫ్రా, కాకతీయ క్రిస్టల్​ పవర్​ లిమిటెడ్​, ట్రాన్స్​ట్రాయ్​ రోడ్డు ప్రాజెక్టులకు మాలినేని సాంబశివరావు డైరెక్టర్​గా ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement