Friday, April 26, 2024

మ‌హ‌నీయుల త్యాగాలు మ‌రువ‌లేనివి : మంత్రి హరీశ్ రావు

సిద్దిపేట : మ‌హ‌నీయుల త్యాగాలు మ‌రువ‌లేనివ‌ని, నేటి యువ‌త వారిని ఆద‌ర్శంగా తీసుకోవాల‌ని మంత్రి హ‌రీశ్ రావు అన్నారు. సిద్దిపేట పట్టణ ఏన్సాన్ పల్లి సర్కిల్ లోని సర్దార్ పాపన్న గౌడ్ వర్థంతి సందర్భంగా రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు పూల మాలలు వేసి నివాళులర్పించారు. మంత్రి వెంట జెడ్పీ చైర్మన్ రోజాశర్మ, జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, గౌడ సంఘం ప్రతినిధులు ప్రకాశ్, కిషన్ పాల్గొన్నారు. అనంతరం గ్రామంలోని తెలంగాణ తల్లి విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంను ప్రారంభించారు.

నారాయణరావుపేట మండల కేంద్రమైన నారాయణరావుపేట గ్రామంలో సర్దార్ పాపన్న గౌడ్ వర్థంతి సందర్భంగా మంత్రి హ‌రీశ్ రావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం గ్రామ రామాలయంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement