Thursday, May 9, 2024

దక్షిణాఫ్రికాలో మహానాడు.. ఘనంగా నిర్వహించిన టీడీపీ ఎన్నారై శాఖ

అమరావతి, ఆంధ్రప్రభ: తెలుగుదేశం పార్టీ 40 సంవత్సరాల ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటు-న్న, ఎన్టీఆర్‌ జయంత్యుత్సవాల ప్రారంభం సందర్భంగా దక్షిణాఫ్రికా దేశంలో టీడీపీ ఎన్‌ఆర్‌ఐ శాఖ ఘనంగా మహానాడు వేడుకలు నిర్వహించింది. జోహన్నెస్‌బర్గ్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి, రాజమహేంద్రవరం పార్లమెంటరీ నియోజకవర్గం ఇంచార్జ్‌ జవహర్‌, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష హాజరయ్యారు. సౌత్‌ ఆఫ్రికాలో ఉన్న వివిధ నగరాల నుంచి టీడీపీ ప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. గౌతు శిరీష మాట్లాడుతూ జన్మభూమి విధానాన్ని ప్రవేశపెట్టిన పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు దానికి కొనసాగింపుగా గ్లోబల్‌ ఫారం ఫర్‌ స్టసనబుల్‌ ట్రాన్స్ఫర్మేషన్‌(జీఎఫ్‌ఎస్‌టీ) అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చారని, దీన్ని ప్రత్యేక అంశంగా అందరూ గుర్తించి ముందుకు నడిపించాలని కోరారు. అనంతరం ఎన్‌ఆర్‌ఐ టీడీపీ సభ్యత్వాల మీద గౌతు శిరీష తీర్మానం ప్రవేశ పెట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement