Wednesday, May 1, 2024

లాక్‌డౌన్ నేపథ్యంలో బుల్లి బైకులపై పోలీసుల పహారా

కరోనా కట్టడికి తెలంగాణలో లాక్‌డౌన్ కఠినంగా సాగుతోంది. ఈ మేరకు హైదరాబాద్‌లో లాక్‌డౌన్ అమ‌లుకు న‌గ‌ర పోలీసులు క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. దీంతో ఎక్క‌డిక‌క్క‌డ చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి రోడ్ల‌పై అన‌వ‌స‌రంగా తిరిగే వాహ‌నాల‌ను నియంత్రిస్తున్నారు. మంగ‌ళ‌వారం మాదాపూర్ సీఐ, ఎస్ఐలు బుల్లి ఈ-బైక్‌ల‌పై తిరుగుతూ లాక్‌డౌన్‌ను ప‌ర్య‌వేక్షించారు. హ‌లా ఎల‌క్ర్టిక్ వాహ‌న కంపెనీ ఇటీవ‌ల మాదాపూర్ పోలీసు స్టేష‌న్‌కు ఈ-బైకుల‌ను డోనేట్ చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement