Friday, April 19, 2024

తెలంగాణ క్యాబినెట్ భేటీ…లాక్ డౌన్ పై నిర్ణయం !!

కరోనా మహమ్మారి వేళ తెలంగాణ రాష్ట్ర మంత్రి మండలి భేటీ కానుంది. ఈ నెల 30న మధ్యాహ్నం రెండు గంటలకు క్యాబినెట్ భేటీ జరగనుంది. ఈ భేటీ లో లాక్ డౌన్ పొడిగింపు పై నిర్ణయం క్లారిటీ రానుంది. ఇక అదే రోజుకి ప్రస్తుతం ఉన్న లాక్ డౌన్ సమయం కూడా గడిచిపోతోంది. ఈ నేపథ్యంలోనే క్యాబినెట్ భేటీ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కాగా తెలంగాణలో ప్రస్తుతం కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. అయితే దానికి కారణం కూడా లేకపోలేదు. కేసులను కూడా తగ్గిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కేసులు కూడా తగ్గుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement