Tuesday, April 30, 2024

తెలుగు రాష్ట్రాల్లో లంపి స్కిన్ వైరస్ కలకలం

ఇప్పటికే ఎన్నో వైరస్ లు ప్రజలను పట్టిపీడిస్తున్నాయి. అయితే ఇప్పుడు కొత్తగా పశువులకు వైరస్ లు వస్తున్నాయి. తాజాగా.. తెలుగు రాష్ట్రాల్లో లంపి స్కిన్ వైరస్ కలకలం సృష్టిస్తోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పశువులకు వైరస్ సోకుతుంది. గత రెండు రోజుల క్రితం తెలంగాణ రాష్ట్రంలో రెండు లంపి స్కిన్ వైరస్ కేసులు నమోదు కాగా.. తాజాగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో తొలి కేసు నమోదైంది. నంద్యాలలోని డోన్ మండలం చనుగొండ్లలో ఓ కోడె దూడకు వైరస్ సోకింది. దీంతో పశువైద్య అధికారులు అప్రమత్తమయ్యారు. గత నెలలో డోన్ సంతలో పశువులను కొనుగోలు చేసినట్టు గుర్తించారు. అయితే, ఇటు తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కూడా పశువులకు లంపి స్కిన్ వైరస్ సోకిన విషయం తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement