Friday, May 17, 2024

అల్లు రామ‌లింగ‌య్య శ‌త దినోత్స‌వ వేడుక‌లు-అల్లు స్టూడియోస్ ని ప్రారంభించిన చిరంజీవి దంప‌తులు

దివంగ‌త న‌టుడు అల్లు రామ‌లింగ‌య్య శ‌త దినోత్స‌వం సంద‌ర్భంగా అల్లు స్టూడియోస్‌ను గ్రాండ్‌గా ప్రారంభించారు. దాదాపు 10ఎకరాల్లో ఏర్పాటైన ఈ స్టూడియో..మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ఘనంగా ప్రారంభమైంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. అల్లు స్టూడియో హైదరాబాద్‌ సిటీ అవుట్ స్కర్ట్స్‌లో ఉన్న కోకా పేట్‌లో భారీగా నిర్మించారు. అత్యాధునిక టెక్నాలజీతో ఈ స్టూడియోస్‌ను నిర్మించారట. కాగా ఇందులో ‘పుష్ప’ పార్ట్‌-2 షూటింగ్‌ను చాలా వరకు జరుపనున్నట్లు టాక్. ఇప్పటికే పుష్ప సీక్వెల్‌కు సంబంధించిన పనులు ప్రారంభమైయ్యాయట. ఈ వేడుకకు అల్లు ఫ్యామిలీతో పాటు చిరంజీవి, ఆయన సతీమణి సురేఖ హాజరయ్యారు. అనంతరం రామలింగయ్య విగ్రహానికి పూల మాలలు వేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement