Thursday, May 2, 2024

TS | రాములమ్మకు లక్కీ చాన్స్​.. ప్రచార కమిటీ చీఫ్ కోఆర్డినేటర్​గా నియామకం

తెలంగాణ ఎన్నికల వేళ బీజేపీ నుంచి కాంగ్రెస్​ పార్టీలో చేరిన విజయశాంతి లక్కీ చాన్స్​ దక్కింది. నామినేషన్లు ముగియడంతో రాములమ్మకు సముచిత స్థానాన్ని కేటాయించాలని పార్టీ భావించనట్టు తెలుస్తోంది. అందులో భాగంగా తెలంగాణ ఎన్నికల కోసం ప్రచార కమిటీ, ప్లానింగ్ కమిటీని కాంగ్రెస్ నియమించింది. ఇందులో 15 మందికి కన్వీనర్ పోస్టులు ఇచ్చింది. ప్రచార కమిటీ, ప్లానింగ్ కమిటీలోకి విజయశాంతిని తీసుకున్నారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చీఫ్ కోఆర్డినేటర్, ప్లానింగ్ కమిటీ కన్వీనర్ గా నియమిస్తూ హైకమాండ్​ బాధ్యతలు అప్పగించింది.

ఇక. మహేశ్వరం టికెట్​ ఆశించిన పారిజాతకు కన్వీనర్ పోస్ట్ ఇచ్చారు. అభ్యర్థుల పేర్లనూ ప్రకటించారు. 15మంది కన్వీనర్లలో సమరసింహారెడ్డి, పుష్పలీల, మల్లురవి, కోదండ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి, రమేష్ ముదిరాజ్, పారిజాత రెడ్డి, సిద్దేశ్వర్ అలీబిన్ ఇబ్రహీం మస్కతి, దీపక్ జాన్, ఓబెద్దుల కోత్వాల్, రామ్మూర్తి నాయక్, తదితరులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement